@aqua.shade0: Link is on my profile!! Comment “glasses” and I’ll send it to you☀️🌊🌴

Aqua Shade🕶️
Aqua Shade🕶️
Open In TikTok:
Region: US
Sunday 05 July 2026 04:49:22 GMT
87
1
0
1

Music

Download

Comments

There are no more comments for this video.
To see more videos from user @aqua.shade0, please go to the Tikwm homepage.

Other Videos

నిజామాబాద్‌ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో ప్రశాంత్, సంధ్య దంపతులు నివాసం ఉంటున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం ఉపాధి కోసం ప్రశాంత్ కొన్నేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. భర్త దూరంగా ఉండటంతో సంధ్య.. నిజామాబాద్‌లోని ఇంద్రపూర్ కాలనీకి చెందిన మిరుగూరి అనిల్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. ఆమెను నిలదీయడం మొదలుపెట్టాడు. ఫోన్‌లోనే దంపతులు ఇద్దరూ తరచూ గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలో జూన్ 27న ప్రశాంత్.. గల్ఫ్ నుంచి తిరిగి తన సొంతూరికి వచ్చాడు. ప్రశాంత్ రాకతో తమ చీకటి బంధానికి అడ్డుకట్ట పడుతుందని భావించిన సంధ్య, అనిల్‌.. అతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. సంధ్య, అనిల్.. తమ కుట్రను అమలు చేయడానికి అదే గ్రామానికి చెందిన కంది వెంకటసాయి అలియాస్ బంటి అనే వ్యక్తి సహాయం కోరారు. ప్లాన్‌లో భాగంగా జూన్ 29న బంటి.. ప్రశాంత్‌కి ఫుల్లుగా మద్యం తాగించాడు. ప్రశాంత్ పూర్తిగా మత్తులోకి జారుకున్నాక.. ఫోన్‌లో భార్య సంధ్య ఇచ్చిన సూచనలతో అతడిని డాబా పైనుంచి కిందకు తోసేశాడు. పైనుంచి పడటంతో ప్రశాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కానీ ప్రాణాలు పోలేదు. దీంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు సంధ్య నాటకానికి తెరలేపింది. సంధ్య, వెంకటసాయి కలిసి అతడిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం పేరుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి ప్రియుడు అనిల్ కూడా వచ్చాడు. ఇక్కడే అసలైన ప్లాన్ మెుదలుపెట్టారు.  ప్రైవేటు హాస్పిటల్ చికిత్స తర్వాత ప్రశాంత్‌ను ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాతే ఈ ముగ్గురు కలిసి అసలు కిరాతకానికి ఒడిగట్టారు. ప్రియుడు అనిల్ ప్రోత్సాహంతో.. భర్త ప్రశాంత్ చేతికి ఉన్న కాన్యులా ద్వారా మత్తు ఇంజెక్షన్లు, అలాగే టాయిలెట్ క్లీనర్ కలిపిన లిక్విడ్‌ని నేరుగా రక్తంలోకి ఎక్కించింది సంధ్య. ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ప్రభావానికి అతడు గిలగిల కొట్టుకుంటుండగా.. మంచం పైనుంచి కిందకు తోసి, అతడికి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు. ప్రశాంత్ చనిపోయిన తర్వాత ఇది సాధారణ ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే, కొడుకు గల్ఫ్ నుంచి వచ్చిన విషయం కానీ.. అతడికి గాయాలై ఆసుపత్రికి వెళ్లిన విషయం కానీ.. అతడు చనిపోయే వరకు జరిగిన పరిణామాలేవి.. సంధ్య తనకు చెప్పకపోవడంతో మృతుడి తల్లి శ్యామలకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్, ఎస్ఐ సుస్మిత.. తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. టెక్నికల్ ఎవిడెన్స్, కాల్ డేటా రికార్డులు పరిశీలించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. వారు తమ నేరాన్ని అంగీకరించారు. దీంతో ప్రధాన నిందితురాలు సంధ్య, ప్రియుడు అనిల్.. వారికి సహకరించిన వెంకటసాయి అలియాస్ బంటి ముగ్గురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.  #Nizamabad #telangananews
నిజామాబాద్‌ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో ప్రశాంత్, సంధ్య దంపతులు నివాసం ఉంటున్నారు. కుటుంబ పోషణ నిమిత్తం ఉపాధి కోసం ప్రశాంత్ కొన్నేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. భర్త దూరంగా ఉండటంతో సంధ్య.. నిజామాబాద్‌లోని ఇంద్రపూర్ కాలనీకి చెందిన మిరుగూరి అనిల్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. ఆమెను నిలదీయడం మొదలుపెట్టాడు. ఫోన్‌లోనే దంపతులు ఇద్దరూ తరచూ గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలో జూన్ 27న ప్రశాంత్.. గల్ఫ్ నుంచి తిరిగి తన సొంతూరికి వచ్చాడు. ప్రశాంత్ రాకతో తమ చీకటి బంధానికి అడ్డుకట్ట పడుతుందని భావించిన సంధ్య, అనిల్‌.. అతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. సంధ్య, అనిల్.. తమ కుట్రను అమలు చేయడానికి అదే గ్రామానికి చెందిన కంది వెంకటసాయి అలియాస్ బంటి అనే వ్యక్తి సహాయం కోరారు. ప్లాన్‌లో భాగంగా జూన్ 29న బంటి.. ప్రశాంత్‌కి ఫుల్లుగా మద్యం తాగించాడు. ప్రశాంత్ పూర్తిగా మత్తులోకి జారుకున్నాక.. ఫోన్‌లో భార్య సంధ్య ఇచ్చిన సూచనలతో అతడిని డాబా పైనుంచి కిందకు తోసేశాడు. పైనుంచి పడటంతో ప్రశాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కానీ ప్రాణాలు పోలేదు. దీంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు సంధ్య నాటకానికి తెరలేపింది. సంధ్య, వెంకటసాయి కలిసి అతడిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం పేరుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి ప్రియుడు అనిల్ కూడా వచ్చాడు. ఇక్కడే అసలైన ప్లాన్ మెుదలుపెట్టారు. ప్రైవేటు హాస్పిటల్ చికిత్స తర్వాత ప్రశాంత్‌ను ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాతే ఈ ముగ్గురు కలిసి అసలు కిరాతకానికి ఒడిగట్టారు. ప్రియుడు అనిల్ ప్రోత్సాహంతో.. భర్త ప్రశాంత్ చేతికి ఉన్న కాన్యులా ద్వారా మత్తు ఇంజెక్షన్లు, అలాగే టాయిలెట్ క్లీనర్ కలిపిన లిక్విడ్‌ని నేరుగా రక్తంలోకి ఎక్కించింది సంధ్య. ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ప్రభావానికి అతడు గిలగిల కొట్టుకుంటుండగా.. మంచం పైనుంచి కిందకు తోసి, అతడికి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు. ప్రశాంత్ చనిపోయిన తర్వాత ఇది సాధారణ ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే, కొడుకు గల్ఫ్ నుంచి వచ్చిన విషయం కానీ.. అతడికి గాయాలై ఆసుపత్రికి వెళ్లిన విషయం కానీ.. అతడు చనిపోయే వరకు జరిగిన పరిణామాలేవి.. సంధ్య తనకు చెప్పకపోవడంతో మృతుడి తల్లి శ్యామలకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్, ఎస్ఐ సుస్మిత.. తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. టెక్నికల్ ఎవిడెన్స్, కాల్ డేటా రికార్డులు పరిశీలించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. వారు తమ నేరాన్ని అంగీకరించారు. దీంతో ప్రధాన నిందితురాలు సంధ్య, ప్రియుడు అనిల్.. వారికి సహకరించిన వెంకటసాయి అలియాస్ బంటి ముగ్గురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. #Nizamabad #telangananews

About