@shaikhadhilchansh: పకోడా అమ్మేవాడి కూతురు నుంచి ఐఏఎస్ అధికారి వరకు… దీపేష్ కుమారి ఇన్స్పిరేషనల్ జర్నీ... రాజస్థాన్లోని భరత్పూర్లో ఒక చిన్న గదిలో ఏడుగురు కుటుంబం నివసించేది. తండ్రి గోవింద్ కుమార్ 25 ఏళ్లపాటు వీధుల్లో పకోడాలు, స్నాక్స్ అమ్ముతూ కుటుంబాన్ని పోషించాడు. పేదరికం, పరిమిత వనరులు… కానీ విద్యపై మాత్రం ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ కుటుంబంలో పుట్టిన దీపేష్ కుమారి చిన్నప్పటి నుంచే చదువుపై దృష్టి పెట్టింది. భరత్పూర్లోని శిశు ఆదర్శ విద్యా మందిర్లో చదివి 10వ తరగతిలో 98 శాతం, 12వ తరగతిలో 89 శాతం మార్కులు సాధించింది. తర్వాత జోధ్పూర్లోని ఎంబీఎం ఇంజనీరింగ్ కాలేజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్, ఐఐటీ బాంబే నుంచి ఎంటెక్ పూర్తి చేసింది. ఒక ఏడాది ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన తర్వాత సివిల్ సర్వీస్ కలను సాకారం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఉద్యోగం వదిలేసి యూపీఎస్సీ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. 2020లో మొదటి ప్రయత్నం విఫలమైంది. కానీ వదలేసింది లేదు. తన సేవింగ్స్తో ఢిల్లీకి వెళ్లి కోచింగ్ తీసుకుంది. 2021లో ఆమె కృషి ఫలించింది. ఆల్ ఇండియా ర్యాంక్ 93తో యూపీఎస్సీ క్లియర్ చేసి ఐఏఎస్ అధికారి అయ్యింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 4వ ర్యాంక్ సాధించింది. జార్ఖండ్ కేడర్కు అలాట్ అయింది. ఆమె విజయం కుటుంబంలోని ఇతరులకు కూడా స్ఫూర్తి అయింది. చెల్లెలు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తోంది. ఒక సోదరుడు ఐఐఎంఎస్ గువాహటిలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. మరొకరు లాతూర్లో చదువుతున్నారు. “నేను అలసిపోయినప్పుడల్లా నాన్నగారి పోరాటం నాకు శక్తినిచ్చేది” అని దీపేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. పేదరికం నుంచి బయటపడి దేశ సేవకు ముందుకు వచ్చిన ఈ కథ లక్షల మంది యువతకు ప్రేరణగా నిలుస్తోంది.... - సిరాజ్ దావల్జీ అనంతపురం 8008186545. . . . #IASSuccessStory #పకోడా_విక్రేత_కూతురు #fblifestyle